Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, August 16, 2013

మార్కు6వఅధ్యాయము

1  ఆయన అక్కడనుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. 
2  విశ్రాంతిదినము వచ్చినప్పుడు ఆయన సమాజమందిరములో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి - ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చెను? ఇతనికియ్యబడిన ఈ జ్ఞానమెట్టిది? ఇతని చేతులవలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి; ఇదేమి? 
3  ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని చెల్లెండ్లు ఇక్కడ మనయొద్దనే యున్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. 
4  అందుకు యేసు - ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన యింటివారిలోను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పెను. 
5  అందువలన కొద్దిమంది రోగులమీద చేతులుంచి వారిని స్వస్థపరచుటతప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. 
6  అయన చుట్టుపట్లనున్న గ్రామములు తిరుగుచు బోధించుచుండెను. 
7  ఆయన పన్నెండుగురు శిష్యులను తనయొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు, అపవిత్రాత్మల మీద వారికధికారమిచ్చి 
8  - ప్రయాణముకొరకు చేతికర్రను తప్ప రొట్టెనైనను జాలెనైనను సంచిలో సొమ్మునైనను తీసికొనక 
9  చెప్పులు తొడుగుకొనుడనియు, రెండంగీలు వేసికొనవద్దనియు వారికాజ్ఞాపించెను. 
10  మరియు ఆయన వారితో ఇట్లనెను - మీరెక్కడ ఒక యింట ప్రవేశించెదరో అక్కడనుండి మీరు బయలుదేరువరకు ఆ యింటనే బసచేయుడి. 
11  ఏ స్థలమందైనను జనులు మిమ్మును చేర్చుకొని మీ మాటలు వినకుంటే, మీరు అక్కడనుండి బయలుదేరునప్పుడు వారిమీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింద ధూళి దులిపివేయుడి. 
12  కాగా వారు బయలుదేరి, మారుమనస్సు పొందవలెనని ప్రకటించుచు 
13  దయ్యములు అనేకములు వెళ్లగొట్టుచు రోగులను అనేకులకు నూనె రాచి స్వస్థపరచుచునుండిరి. 
14  ఆయన కీర్తి ప్రసిద్ధమాయెను గనుక రాజైన హేరోదు ఆయననుగూర్చి విని - బాప్తిస్మమిచ్చు యోహాను మృతులలోనుండి లేచియున్నాడు గనుక అతనియందు అద్భుతములు క్రియాసాధకములగుచున్నవని చెప్పెను. 
15  ఇతరులు - ఈయన ఏలీయా అనియు, మరకొందరు - ఈయన ప్రవక్తయనియు, ప్రవక్తలలో ఒకనివలె నున్నాడనియు చెప్పుకొనుచుండిరి. 
16  అయితే హేరోదు విని - ఇతడు నేను తలగొట్టించిన యోహానే; అతడు మృతులలోనుండి లేచియున్నాడని చెప్పెను. 
17  హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్యయైన హేరోదియను పెండ్లిచేసికొనినందున యోహాను - నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయముకాదని హేరోదుతో చెప్పెను గనుక 
18  ఇతడామె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించియుండెను. 
19-20. హేరోదియ అతనిమీద పగ పట్టి అతని చంపింప నుద్దేశించెను గాని ఆమెచేత కాకపోయెను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరశుద్ధుడునగు మనుష్యుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచు వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమిచేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను. 21. అయితే సమయోచిత దినమొకటి వచ్చెను; ఎట్లనగా హేరోదు తన జన్మదినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలైయదేశ ప్రముఖులకును విందు చేయించెను 
21  అయితే సమయోచిత దినమొకటి వచ్చెను; ఎట్లనగా హేరోదు తన జన్మదినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలైయదేశ ప్రముఖులకును విందు చేయించెను. 
22  అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికివచ్చి నాట్యమాడి హేరోదును అతనితోకూడ పంక్తిని కూర్చున్నవారిని సంతోషపరచెను గనుక రాజు - నీకిష్టమైనది ఏదైనను నన్నడుగుము, నేను నీకిచ్చెదనని ఆ చిన్నదానితో చెప్పెను. 
23  మరియు - నీవు నా రాజ్యములో సగముమట్టుకు ఏమి అడిగినను నీకిచ్చెదనని అతడు ఆమెతో ఒట్టుపెట్టుకొనెను. 
24  గనుక ఆమె వెళ్లి - నేనేమి అడిగెదనని తన తల్లి నడుగగా ఆమె - బాప్తిస్మమిచ్చు యోహాను తల అడుగుమనెను. 
25  వెంటనే ఆమె త్వరగా రాజునొద్దకు వచ్చి - బాప్తిస్మమిచ్చు యోహాను తల పళ్లెములో పెట్టి యిప్పుడే నాకిప్పింప గోరుచున్నానని చెప్పెను. 
26  రాజు బహు దుఃఖపడెను గాని తాను పెట్టుకొనిన ఒట్టు నిమిత్తమును తనతో కూర్చున్నవారి నిమిత్తమును ఆమెకు ఇయ్యను అననొల్లకపోయెను. 
27  వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి యొక బంటును పంపెను. వాడు వెళ్లి చెరసాలలో అతని తల గొట్టి 
28  పళ్లెములో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్నదానికిచ్చెను, ఆ చిన్నది తన తల్లికిచ్చెను. 
29  యోహాను శిష్యులు ఈ సంగతి విని, వచ్చి శవమును ఎత్తికొనిపోయి సమాధిలో ఉంచిరి. 
30  అంతట అపొస్తలులు యేసునొద్దకు కూడివచ్చి తాము చేసినవన్నియు బోధించినవన్నియు ఆయనకు తెలియజేసిరి. 
31  అప్పుడాయన - మీరేకాంతముగా అరణ్యస్థలమునకు వచ్చి కొంచెముసేపు అలసట తీర్చుకొనుడని చెప్పెను; ఏలయనగా అనేకులు వచ్చుచు పోవుచునుండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయెను. 
32  కాగా వారు దోనెయెక్కి అరణ్యప్రదేశమునకు ఏకాంతముగా వెళ్లిరి. 
33  వారు వెళ్లుచుండగా జనులు చూచి, అనేకులాయనను గుర్తెరిగి, సకల పట్టణములనుండి అక్కడికి కాలినడకను పరుగెత్తి వారికంటె ముందుగా వచ్చిరి. 
34  గనుక యేసు వచ్చి విస్తారమైన ఆ జనసమూహమును చూచి, వారు కాపరిలేని గొర్రెలవలె ఉన్నందున వారిమీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. 
35  చాల ప్రొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులాయనయొద్దకు వచ్చి - ఇది అరణ్యప్రదేశము, ఇప్పుడు చాల ప్రొద్దుపోయినది; 
36  చుట్టుపట్ల గ్రామములకు వారు వెళ్లి భోజనమునకేమైనను కొనుక్కొనుటకు వారిని పంపివేయుమని చెప్పిరి. 
37  అందుకాయన - మీరు వారికి భోజనము పెట్టుడనగా వారు - మేము వెళ్లి యిన్నూరు దేనారములరొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని ఆయన నడిగిరి. 
38  38-39. అందుకాయన - మీయొద్ద ఎన్ని రొట్టెలున్నవి? పోయి చూడుడని వారితో చెప్పెను. వారు చూచి తెలిసికొని - అయిదు రొట్టెలును రెండు చేపలునున్నవనిరి. అప్పుడాయన - పచ్చికమీద అందరు పంక్తులు పంక్తులుగా కూర్చుండవలెనని వారికాజ్ఞాపింపగా 
39  38-39. అందుకాయన - మీయొద్ద ఎన్ని రొట్టెలున్నవి? పోయి చూడుడని వారితో చెప్పెను. వారు చూచి తెలిసికొని - అయిదు రొట్టెలును రెండు చేపలునున్నవనిరి. అప్పుడాయన - పచ్చికమీద అందరు పంక్తులు పంక్తులుగా కూర్చుండవలెనని వారికాజ్ఞాపింపగా 
40  వారు నూరేసిమంది చొప్పునను ఏబదేసిమందిచొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి. 
41  అంతట ఆయన ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను ఎత్తికొని, ఆకాశమువైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి, ఆ రెండు చేపలను అందరికిని పంచి పెట్టించెను. 
42-43. వారందరు తిని తృప్తిపొందినతరువాత మిగిలిన చేపలును రొట్టె ముక్కలును పన్నెండు గంపెళ్లు ఎత్తిరి. 
44  ఆ రొట్టెలు తినినవారు అయిదువేలమంది పురుషులు. 
45  వెంటనే ఆయన జనసమూహమును పంపివేయునంతలో తన శిష్యులను దోనె ఎక్కి అద్దరినున్న బేత్సయిదాకు ముందుగా వెళ్లుడని ఆయన బలవంతము చేసెను. 
46  ఆయన వారిని వీడుకొలిపి, ప్రార్థనచేయుటకై కొండకు వెళ్లెను. 
47  సాయంకాలమైనప్పుడు ఆ దోనె సముద్రము మధ్య ఉండెను గాని ఆయన ఒంటిగా మెట్టననుండెను. 
48  అప్పుడు గాలి వారికి ఎదురైనందున దోనె నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి, ఇంచుమించు రాత్రి నాలుగవ జామున సముద్రముమీద నడుచుచు వారియొద్దకు వచ్చి వారిని దాటిపోవలెనని యుండెను. 
49  ఆయన సముద్రముమీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలువేసిరి. 
50  అందరు ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి - ధైర్యము తెచ్చుకొనుడి; నేనే, భయపడకుడని చెప్పెను. 
51  తరువాత ఆయన దోనె యెక్కి వారియొద్దకు వచ్చినప్పుడు గాలి అణగెను; అందుకు వారు తమలోతాము మిక్కిలి విభ్రాంతినొందిరి; 
52  అయినను వారి హృదయము కఠినమాయెను గనుక వారు రొట్టెలనుగూర్చిన సంగతి గ్రహింపలేదు. 
53  వారు అవతలకు దాటి గెన్నేసరెతుదగ్గర ఒడ్డుకు వచ్చి దరి పట్టిరి. 
54  వారు దోనె దిగగానే జనులు ఆయనను గురుతుపట్టి 
55  ఆ ప్రదేశమందంతట పరుగెత్తికొనిపోయి, ఆయన యున్నాడని వినినచోటుకు రోగులను మంచములమీద మోసికొని వచ్చుటకు మొదలు పెట్టిరి. 
56  గ్రామములలోను పట్టణములలోను పల్లెటూళ్లలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించెనో అక్కడివారు రోగులను సంతవీధులలో ఉంచి, వారు ఆయన వస్త్రపుచెంగుమాత్రము ముట్టనిమ్మని ఆయను వేడుకొనిరి; ఆయనను ముట్టినవారందరు స్వస్థతనొందిరి. 
Download Audio File

No comments:

Post a Comment